ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన PV సింధు

     Written by : smtv Desk | Sun, Jul 25, 2021, 03:11 PM

ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన PV సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణి అందుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం ఇజ్రాయెల్‌కి చెందిన సెనియా పోలికర్పోవా‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు వరుస సెట్లలో గెలుపొంది మ్యాచ్‌ని సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు.. రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌లో పీవీ సింధుకి 58వ ర్యాంక్‌లో ఉన్న సెనియా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఫస్ట్ సెట్‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన పీవీ సింధు.. 21-7తో సెట్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సెకండ్ సెట్‌‌‌లో సెనియా కాస్త ప్రతిఘటించినా.. ఆమెకి పుంజుకునే అవకాశం మాత్రం పీవీ సింధు ఇవ్వలేదు. దాంతో.. రెండో సెట్‌ని కూడా 21-10తో చేజిక్కించుకున్న సింధు.. మ్యాచ్‌ని ముగించేసింది.

శనివారం గ్రూప్-డి ఫురుషుల సింగిల్స్‌లో పోటీపడిన సాయి ప్రణీత్.. తన కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న ఇజ్రాయిల్ షట్లర్ మిశా జిబర్‌మాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ పోటీపడటం ఇదే తొలిసారికాగా.. 41 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌పరంగా ఈ ఇద్దరిపైనే భారత్ పతక ఆశలున్నాయి.





Untitled Document
Advertisements