అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి జ‌యంతి క‌న్నుమూత‌

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 10:45 AM

అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి జ‌యంతి క‌న్నుమూత‌

అనారోగ్యంతో సీనియ‌ర్ నటి జయంతి బెంగ‌ళూరులోని త‌న నివాసంలో (76) కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. జయంతి మరణం ప‌ట్ల పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

జ‌యంతి సొంత ప్రాంతం కర్ణాటకలోని బళ్లారి. ఆమె 1963లో క‌న్నడ సినిమా ‘జెనుగూడు’తో నటిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. ద‌క్షిణాది భాష‌ల‌లో పాటు హిందీ సినిమాల్లోనూ ఆమె న‌టించారు. దాదాపు 500కు పైగా సినిమాల్లో ఆమె నటించారు.

ఎన్టీఆర్, ఎంజీఆర్, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి వారి సినిమాల్లోనూ న‌టించారు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాలో ఆయ‌న‌ నటనకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం వంటి తెలుగు సినిమాల్లో న‌టించారు.





Untitled Document
Advertisements