ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్‌...ముంబయి, చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 10:51 AM

ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్‌...ముంబయి, చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుండగా.. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. ఈ మేరకు ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా మెయిల్ పంపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఐపీఎల్ జట్లలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ని మధ్యలో బీసీసీఐ నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. అప్పటికి 29 మ్యాచ్‌లు మాత్రమే ముగిశాయి. దాంతో.. మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే అధికారింగా బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజులకే యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.

సెప్టెంబరు 19న ముంబయి, చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. క్వాలిఫయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న, ఎలిమినేటర్ అక్టోబరు 11న, క్వాలిఫయర్-2 అక్టోబరు 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 15న జరగనుంది. త్వరలోనే మ్యాచ్‌ల వారిగా షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించనుంది.

27 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో ఏడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకి.. రాత్రి మ్యాచ్‌లు 7.30కి స్టార్ట్ అవుతాయి. మొత్తం 31 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 13 మ్యాచ్‌లు దుబాయ్‌లో 10 మ్యాచ్‌లు షార్జాలో.. మిగిలిన 8 మ్యాచ్‌లు అబుదాబిలో నిర్వహించనున్నారు.





Untitled Document
Advertisements