ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్‌కి షాక్

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 11:51 AM

ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్‌కి షాక్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల గ్రూప్-ఎ‌‌లో ఆదివారం ఆస్ట్రేలియా టీమ్‌తో తలపడిన భారత జట్టు 1-7 తేడాతో పేలవరీతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌‌ని 3-2 ఓడించిన భారత జట్టు.. ఇక మంగళవారం స్పెయిన్‌‌తో ఢీకొట్టనుంది.

మ్యాచ్ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. వరల్డ్ నెం.1 ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా.. 10వ నిమిషంలోనే గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. డేనియల్ బాలే ఆ జట్టుకి బోణి అందించగా.. 21వ నిమిషంలో జెర్మీ, 23వ నిమిషంలో ప్లైన్, 26వ నిమిషంలో జాషువా వరుస గోల్స్‌ చేశారు. భారత్ డిఫెన్స్‌ని అలవోకగా ఛేదించేసిన ఆస్ట్రేలియా.. వరుస గోల్స్ చేయడంతో.. భారత్ ఒకానొక దశలో 0-4తో ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.

భారత్ తరఫున 34వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 4-1కి తగ్గించాడు. కానీ.. ఆ వెంటనే 40, 42వ నిమిషంలో వరుసగా గోల్స్‌ చేసిన బ్లేక్ గోవర్స్ మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 6-1కి పెంచగా.. 51వ నిమిషంలో టిమ్ బ్రాండ్ మరో గోల్ చేసేశాడు. దాంతో.. మ్యాచ్‌పై భారత్ ఆశలు వదిలేసింది.





Untitled Document
Advertisements