మహారాష్ట్రలోని కరాడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ఇప్పుడు అతడిని కటకటాలపాలు చేసింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. తన దగ్గర చిరుత పిల్ల ఉందని.. దాన్ని ఎవరికైనా కావాలంటే అమ్ముతానని పోస్టులో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. పోస్ట్ పెట్టిన వ్యక్తిని ఆదివారం గుర్తించి అతడిని ఇంటి వద్దే అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద అసలు చిరుత పులి లేదని, ప్రచారం కోసమే అలా పోస్ట్ పెట్టినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.