15 ఏళ్ల తరువాత మళ్ళీ జోడి

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 02:36 PM

15 ఏళ్ల తరువాత మళ్ళీ జోడి

మహేష్ బాబు- త్రిష. ఈ ఇద్దరి కాంబినేషన్ వచ్చిన 'అతడు' మూవీ ఏ రేంజ్‌లో హిట్టయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇదే జోడీ 'సైనికుడు' సినిమాలో మహేష్- త్రిష రొమాన్స్ చేసి మ్యాజిక్ క్రియేట్ చేశారు. అయితే అది జరిగిన 15 ఏళ్లకు మళ్ళీ ఈ జోడీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందని తెలుస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా రూపొందించనున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుతో త్రిష రొమాన్స్ చేయనుందనే న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని, అందులో ఒకరిగా త్రిష కనిపించనుందని అంటున్నారు. కథ ప్రకారం మహేష్- త్రిషలను టీనేజ్ లవర్స్‌గా చూపించబోతున్నారట త్రివిక్రమ్.





Untitled Document
Advertisements