టీసీఎల్ 10 సిరీస్ ట్యాబ్లెట్లు లాంచ్

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 02:40 PM

టీసీఎల్ 10 సిరీస్ ట్యాబ్లెట్లు లాంచ్

టీసీఎల్ 10 ట్యాబ్ మ్యాక్స్ 4జీ, టీసీఎల్ 10 ట్యాబ్ మ్యాక్స్ 4జీ(వైఫై), టీసీఎల్ ట్యాబ్ 10 4జీ ఫుల్‌హెచ్‌డీ, టీసీఎల్ ట్యాబ్ 10ఎస్(వైఫై) ట్యాబ్లెట్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. కంపెనీ లాంచ్ చేసిన మొదటి ట్యాబ్లెట్లు ఇవే. ఈ అన్ని ట్యాబ్లెట్లలో 10 అంగుళాలకు పైగా డిస్‌ప్లేను అందించారు. ఇవి వివిధ దేశాల్లో ఇప్పటికే లాంచ్ అయ్యాయి.
టీసీఎల్ 10 ట్యాబ్ మ్యాక్స్ 4జీ ధరను రూ.20,999గా నిర్ణయించారు. ఇందులో వైఫై వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. వీటిని బ్లూ, గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. టీసీఎల్ ట్యాబ్ 10 4జీ ఫుల్‌హెచ్‌డీ ధరను రూ.16,999గానూ, టీసీఎల్ ట్యాబ్ 10ఎస్(వైఫై) ధరను రూ.15,999గానూ నిర్ణయించారు. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఈ రెండిటిలోనూ దాదాపు ఒకేరకమైన స్పెసిఫికేషన్లు అందించారు. ఒకదాంట్లో నెట్ వర్క్ కనెక్టివిటీ, మరోదాంటో 4జీని అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10.36 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని అంచులు కాస్త మందంగా ఉండనున్నాయి. వీటిలో ఆక్టాకోర్ ప్రాసెసర్‌లను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను వీటిలో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరో 64 జీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే.. వీటిలో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్లను ఇందులో అందించారు. వీటిలో 8000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 10.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768ఈ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ముందువైపు, వెనకవైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. వైఫై, 4జీ, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇందులో కూడా 10.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేనే అందించారు. ఆక్టాకోర్ ఎంటీ8768ఈ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 8000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు.





Untitled Document
Advertisements