"భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ"

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 04:09 PM


మలయాళంలో ప్రజాదరణ పొందిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇందులో పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారు. తాజాగా పవన్ కూడా సెట్స్ పైకి వచ్చారు.

ఈ నేపథ్యంలో చిత్రబృందం "భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ" అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్ రిలీజ్ చేసింది. ఖాకీ దుస్తుల్లో ఉన్న పవన్ ను ఈ పిక్ లో చూడొచ్చు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని చిత్రీకరణ కొనసాగిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.





Untitled Document
Advertisements