పోస్టాఫీస్ స్కీమ్ లో చేరితే రూ.3300!

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 04:16 PM

పోస్టాఫీస్ స్కీమ్ లో చేరితే రూ.3300!

ప్రతి ఏడాది డబ్బులు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. వీటిల్లో డబ్బులు పెడితే ఆకర్షణీయ రాబడి సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే స్కీమ్ ప్రకారం మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారతాయి.

పోస్టాఫీస్‌లో పలు రకాల పథకాలు ఉన్నాయి. వీటిల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే క్రమం తప్పకుండా డబ్బులు పొందొచ్చు. దీనికి మీరు ముందుగానే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా డబ్బులు మాత్రమే కాకుండా మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు డబ్బులు పెట్టొచ్చు. ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. అయితే రూ.9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఈ స్కీ్మ్‌పై 6.6 శాతం వడ్డీ వస్తోంది.

రూ.50 వేలు ఒకేసారి డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాది రూ.3,300 పొందొచ్చు. ఐదేళ్లలో రూ.16,500 పొందొచ్చు. అదే మీరు రూ.లక్ష పెడితే మీకు ప్రతి నెలా రూ.550 అంటే ఏడాదికి రూ.6600 వస్తాయి. రూ.4.5 లక్షలు పెడితే నెలకు రూ.2500 వరకు వస్తాయి.





Untitled Document
Advertisements