దైత్యులు రాక్షసులు. వీరు దక్ష ప్రజాపతి కూతురైన దితి సంతతి. దితి కశ్యపుని భార్య. ఈమె సంధ్యాసమయమున కశ్యపుడు అనాసక్తిగా ఉన్నపుడు అతడితో రమించింది. కశ్యపుడు ఈమెకు జన్మించిన వారు అసురులు కాగలరని శపిస్తాడు. ఈమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సింహిక అనే కుమార్తె జన్మించారు. ఈమె వంశపారంపర్య సంతతి రాక్షసులయ్యారు. దితి వల్ల జన్మించారు కనుక వీరిని దైత్యులు అంటారు.