పూల వ్యాపారంతో ఏడాదికి రూ.15 లక్షల లాభం

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 05:01 PM

పూల వ్యాపారంతో ఏడాదికి రూ.15 లక్షల లాభం

కరోనా దెబ్బకి ఉద్యోగం పోయిందా? మళ్లీ తిరిగి సొంత గ్రామాలకు వచ్చేశారా? డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. పూలతో రూ.లక్షలు వెనకేయొచ్చు. తక్కువ ఖర్చులతోనే కళ్లుచెదిరే లాభం పొందొచ్చు.

మారిగోల్డ్ ఫ్లవర్ (బంతి పూలు) సాగు వల్ల భారీ లాభం పొందొచ్చు. వీటిని పెళ్లిళ్లు జరిగేటప్పుడు, ఫెస్టివల్ వచ్చినప్పుడు డెకరేషన్ కోసం ఉపయోగిస్తారు. ఇంకా వీటిల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. అందుకే వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా వాడతారు. ఈ పూలను సాగుచేయడం వల్ల ప్రతి సంవత్సరం ఏకంగా రూ.15 లక్షలు వెనకేయొచ్చు. ఒక హెక్టార్ పొలం ఉంటే సరిపోతుంది.

అంతేకాకుండా మారీ గోల్డ్ ఫ్లవర్ల జ్యూస్‌ను క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఇంకా అబరబత్తుల తయారీలో కూడా ఈ పూలను వాడతారు. మీకు ఒక ఎకరా పొలం ఉంటే ప్రతి ఏడాది రూ.5-6 లక్షలు సంపాదించొచ్చు. ప్రతి వారం మూడు టన్నుల పూలు కోయొచ్చు.

మార్కెట్‌లో కేజీ పూల ధర రూ.70 వరకు ఉంటుంది. ప్రతి వారం రూ.20 వేల వరకు వస్తాయి. ప్రతి ఏడాది మూడు సార్లు సాగుచేయొచ్చు. ఒకసారి పంట వేస్తే రూ.లక్ష ఖర్చవుతుంది. 40 రోజులకు పూలు పూస్తాయి. వీటిని మార్కెట్‌లో విక్రయించి మంచి రాబడి పొందొచ్చు. కొంత మంది రైతులు ఏడాదికి 4 సార్లు పంట పండిస్తారు.





Untitled Document
Advertisements