ఐపీఎల్ 2022 సీజన్ లోకి మరో రెండు జట్లు...అక్టోబరు 17న వేలం

     Written by : smtv Desk | Wed, Sep 15, 2021, 12:15 PM

ఐపీఎల్ 2022 సీజన్ లోకి మరో రెండు జట్లు...అక్టోబరు 17న వేలం

ఐపీఎల్ 2022 నాటికి మరో రెండు కొత్త జట్లు టోర్నీలోకి రాబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. వచ్చే ఏడాదికి ఆ సంఖ్య పదికి చేరనుంది. అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, కటక్, గౌహతి, ధర్మశాల సిటీల నుంచి బిడ్‌లు వచ్చే అవకాశం ఉంది.

కొత్త జట్ల కోసం వేలం అక్టోబరు 17న జరగనుండగా.. సెప్టెంబరు 21 నుంచి టెండర్‌లను ఆహ్వానించబోతున్నారు. ఈ టెండర్ గడువు అక్టోబరు 5న ముగియనుంది. అయితే.. జట్ల వేలం తేదీ, ప్లేస్‌ని ఇంకా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. అక్టోబరు 17న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్ జట్ల కోసం బిడ్ వేసే కంపెనీల టర్న్ ఓవర్‌ రూ.3000 కోట్లు ఉండాలని ఇప్పటికే స్పష్టం చేసిన బీసీసీఐ.. నెట్‌వర్త్ కూడా రూ.2500 కోట్లు ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. ఆర్పీఎస్‌జీ గ్రూపునకి చెందిన సంజీవ్ గోయెంకా ఓ జట్టుని కొనుగోలు చేయబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఈ గ్రూపునకి చెందిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టీమ్.. రెండేళ్లు ఐపీఎల్‌లో ఆడింది.





Untitled Document
Advertisements