పాన్ కార్డు కలిగిన వారికి తీపికబురు...కేంద్రం కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Sat, Sep 18, 2021, 10:36 AM

పాన్ కార్డు కలిగిన వారికి తీపికబురు...కేంద్రం కీలక నిర్ణయం

మీరు పాన్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు ఆధార్ లింక్ గడువును పొడిగించింది. దీంతో పాన్ కార్డ్ కలిగి ఉండి.. ఇంకా దాన్ని ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ఊరట కలుగనుంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పాన్ ఆధార్ లింక్ గడువును 2022 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధాన గడువు 2021 సెప్టెంబర్ 30తో ముగియాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం గడువును మరోసారి పొడిగించింది.

మోదీ సర్కార్ పాన్ ఆధార్ లింక్ గడువును మరో 6 నెలలు పొడిగించిందని చెప్పుకోవచ్చు. కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల గడువు పొడిగించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT తెలిపింది. అందువల్ల మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే వెంటనే రెండింటినీ అనుసంధానం చేసుకోండి.





Untitled Document
Advertisements