విరేచనాలు అవుతున్నప్పుడు మనం ఇచ్చే ఆహారం ఒక వైపు రోగి బలాన్ని కాపదేడిగా వుండాలి. ఇంకో వైపు జీర్ణశక్తిని కాపాడేదిగాను ఉండాలి.వీలైతే అదే విరేచనలను తగ్గించేదిగాను వుండాలి. అలాంటి ఒక అద్భుతమైన ఆహారం ఇదిగో మీకోసం. పెసరుపప్పులో నీరు ఎక్కువగా పోసి కట్టు తయారు చేసుకోండి. ఈ కట్టులో మీకు అభ్యంతరం లేకపోతే మాంసాన్ని బాగా ఉడికించి తీసిన రసం కలపండి . ఈ మొత్తానికి సమానంగా మజ్జిగ కలపండి. ఈ మిశ్రమంలో ధనియాలు, జీలకర్రలను నేతిలో వేయించి దంచిన పొడిని తగినత కలపండి. ఒక గ్లాసుకి రెండు చంచాల పొడిని కలపవచ్చు. అందులో తగినంత ఉప్పు కలపండి. దీన్నే షడంగా పానీయం అంటారు. మీరు శ్కహరులితే మామ్సరసం కలపకుండానే దిన్ని తీసుకోండి. ఈ షడంగ పానీయం రోగికి శక్తినిస్తుంది. అలాగే ఆకలి పుట్టేలా చేస్తుంది. విరోచనలా తీవ్రతను తగ్గిస్తుంది. నోటికి రుచిని కూడా పుట్టిస్తుంది. అలాగే జ్వరంతో దీర్ఘకాలంగా రోగి లంఖనాలతో ఉన్నప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు, గాయాలు అయినప్పుడు, ఆహారం మాములుగా ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు ఈ షడంగ పానీయం మంచిది. హాస్పటల్ లో బెడ్ మీద ఉన్న రోగులకు ఇది మంచి ఆహారం.