50 కోట్ల పారితోషికం?!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:48 AM

50 కోట్ల పారితోషికం?!

టాలీవుడ్లో మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతకాలంగా ఆయన వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు అందుకుంటున్న పారితోషికం 50 కోట్లకు చేరిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల కేటగిరిలో కనిపిస్తున్న వాళ్లంతా ఇంచుమించు ఇదే స్థాయి పారితోషికాన్ని తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

ఈ కథ అంతా కూడా భారీ స్థాయిలో జరిగిన ఒక బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు కనిపిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' పండుగ సందర్భంగా, జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements