దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 59,963 వద్ద.. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 17,835 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.71 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.