వాహనదారులకు ఝలక్...కార్ల ధరలు పైకి

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 12:05 PM

వాహనదారులకు ఝలక్...కార్ల ధరలు పైకి

మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. రేపటి నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.

అక్టోబర్ 1 నుంచి కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో కార్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంటోంది. వెల్‌ఫైర్ మినహా మిగతా మోడళ్ల ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.

కేవలం టయోటా మాత్రమే కాకుండా ఇప్పటికే దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కూడా కార్ల ధరలను పెంచింది. సెలెరియో మినహా మిగతా కార్ల ధరలు 1.9 శాతం వరకు పైకి కదిలాయి. ఇంకా హీరో టూవీలర్ కంపెనీ కూడా మోటార్‌సైకిళ్ల ధరలను రూ.3 వేలు పెంచేసింది.





Untitled Document
Advertisements