ఉదంకుడు ఇతడు భృగు వంశానికి చెందిన వాడు. గౌతముని శిష్యుడు. గౌతముడు మిగతా శిష్యులకు ఎన్నోరకాల వరములిచ్చి ఇతడిని ఏమాత్రం కనికరించలేదు. అయినను అట్లే గురువులు చుండెను. ఒకరోజు ఉదంకుడు కట్టెలమోపు తెస్తూ ఉండగా అతని జడ కట్టెలమోపు లో చిక్కుకొని ఆ లేదు. ఇప్పుడు ఉదంకుడు అలాగే గురువు వద్దకు వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. అతని కళ్ల వెంట కన్నీటి ధారలు కారగా తన కూతురితో ఆ కన్నీటి ధారలు క్రిందపడకుండా దోసిలి పట్టమన్నాడు. అప్పుడు శిష్యుడు గౌతమునితో మన కష్టాలకు ఉపాయం లేదా, ఇతరుల పై గల దయ నాపై లేదా అని అడుగగా నిన్ను ఎట్లు వదలగలను, ఆ కుమార్తెనిచ్చి నీకు వివాహము చేసెదనని చెప్పాడు. ఆ సంతోషంలో ఉదంకుడు గౌతముని భార్య అహల్య తో ఏమి కావలెనన్న తెచ్చిస్తాను కోరుకొమ్మన్నాడు. అందుకు బదులుగా అహల్య మిత్ర సహుడగు రాజు భార్య మదయంతి వద్దగల కుండలములు తెచ్చి ఇమ్మంది. అప్పుడు ఉదంకుడు మిత్రసహుని భవంతికి వెళ్లి తన గురుపత్ని కోరికను వెల్లడించగా ఆ కుండలములు ఇచ్చి అత్యంత జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. వీటిని అశుభ్రంగా తాగిన ఇక ఎక్కడైనా భూమి పై పెట్టిన సురులు, గంధర్వులు, ఉగరములు అపహరిస్తారు జాగ్రత్త అని చెప్పాడు. వాటిని తీసుకెళుతున్న ఉదంకుడు మధ్యమున ఆకలిగా ఉండి ఆ కుండలములను చెట్టుకు కట్టి ఆకలి తీర్చుకొనుటకు చెట్టు ఎక్కగా గాలికి కుండలములు కిందపడగానే వెంటనే సర్పం ఒకటి వచ్చి ఆ కుండలములను నాగలోకానికి తీసుకు వెళ్లిపోయింది. అప్పుడు ఉదంకుడు భూమిని తవ్వుతుండగా ఇంద్రుడు వచ్చి నువ్విలా కర్రతో నవ్వుతూ ఉంటే ఎంత కాలానికి నాగలోకం చేయగలవు అని అడుగుతాడు. ఏది ఏమైనను బ్రహ్మత్వమునైనను వదులుకుందును కానీ తవ్వడం మాత్రం ఆపను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు కర్రను శూలంగా మార్చగా భూమి అతనికి దారి ఇచ్చింది. ఉదంకుడు నాగ లోకం చేరుకోగా ఇక్కడ ఒక అశ్వం కనిపించి నా యాపానమెత్తి యూదుము నీ కార్యము సిద్ధిస్తుంది అంటుంది. అంతేకాక ఆ అశ్వము గౌతముని గురువు అగ్నిని అని తెలియజేసింది. అప్పుడు ఉదంకుడు అగ్ని చెప్పినట్లుగా ఊగగా యొక్క వెంట్రుకలన్నీ అగ్ని కణములు గా మారి పొగ చిమ్మడం మొదలుపెట్టగానే నాగులు భయపడి కుండలములు తెచ్చి ఇవ్వగా, ఉదంకుడు వాటిని తెచ్చి గురుపత్ని అహల్య సమర్పించాడు.