దసరాకి రెండో పాట ?

     Written by : smtv Desk | Tue, Oct 05, 2021, 04:50 PM

దసరాకి రెండో పాట ?

పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం భీమ్లానాయక్. పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజై విశేష స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఖరారైంది. 'అంత ఇష్టం' అంటూ సాగే ఈ పాటను అక్టోబరు 15న దసరా సందర్భంగా తీసుకువస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది.

ఈ పాట అనేక ఏళ్లపాటు శ్రోతల చెవుల్లో మార్మోగుతుందని సంగీత దర్శకుడు తమన్ అంటున్నారు. తమ హృదయంలోంచి వచ్చిన పాట అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో పవన్ కు జంటగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements