పెరిగిన వంట సిలిండెర్ ధరలు

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 04:01 PM

పెరిగిన వంట సిలిండెర్ ధరలు

దేశంలో రాయితీ, రాయితీయేతర ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.15 చొప్పున‌ పెరిగింది. నేటి నుంచే ఈ ధ‌ర‌లు అమల్లోకి వ‌చ్చాయి. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల‌ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.899.50కి, హైద‌రాబాద్‌లో రూ.952కి పెరిగింది. రెండు నెలల్లో వంటగ్యాస్ ధర నాలుగో సారి పెంచారు. ఈ ఏడాది మొత్తం క‌లిపి వంట గ్యాస్‌ సిలిండర్ ధ‌ర రూ. 205 వరకు పెరిగింది.

కాగా, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు కూడా పెరిగాయి. లీటర్‌ పెట్రోలు ధ‌ర 30 పైసలు, డీజిల్ ధ‌ర‌ 35 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.94గా ఉండ‌గా, డీజిల్‌ ధర రూ.91.42గా ఉంది. చెన్నైలో లీట‌రు పెట్రోలు రూ.100.49గా, డీజిల్ ధ‌ర‌ రూ.95.93గా ఉంది. హైదరాబాద్ లో లీట‌రు పెట్రోలు ధ‌ర‌ రూ.107.09గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర‌ రూ.99.75కి చేరింది.





Untitled Document
Advertisements