ఏపీ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

     Written by : smtv Desk | Fri, Oct 08, 2021, 11:13 AM

ఏపీ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

దసరా పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఇందులో సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ (07456), నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ (07455), సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (07053), కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07054) ఉన్నాయి.

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. అలాగే, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ రైలు 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements