వ్యాపారం చేసుకోవడానికి రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్రం

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 12:41 PM

వ్యాపారం చేసుకోవడానికి రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ముద్రా యోజన కూడా ఒకటి. ఇది లోన్ స్కీమ్. దీని ద్వారా అర్హత కలిగిన వారు సులభంగానే రుణం పొందొచ్చు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని భావించే వారు లేదంటే ఉన్న బిజినెస్‌ను విస్తరించుకోవాలని భావించే వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందొచ్చు.

అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements