దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు తీపికబురు అందించింది. చౌక ధరకే ఇల్లు, ప్రాపర్టీ, స్థలం వంటి కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం బ్యాంక్ ఇ-వేలం నిర్వహించబోతోంది. ఇందులో పాల్గొని నచ్చిన ప్రాపర్టీని మార్కెట్ రేటు కన్నా తక్కువకే కొనొచ్చు.
స్టే్ట్ బ్యాంక్ అక్టోబర్ 25న ఇ-వేలం నిర్వహించనుంది. కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సంబంధించి వేలం ఉంటుంది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు ఇల్లు, ప్రాపర్టీ, షాపు, స్థలం కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.
అంతేకాకుండా ఎస్బీఐ కారు కొనే వారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉంచింది. టాటా అల్ట్రోజ్ కారు కొనుగోలుపై రూ.3 వేల అదనపు తగ్గింపు అందిస్తోంది. వడ్డీ రేటులో కూడా 0.5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.