విటమిన్ డి లోపంతో భాదపడుతున్నారా..? అయితే ఇలా చేయండి!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 11:45 AM

విటమిన్ డి లోపంతో భాదపడుతున్నారా..? అయితే ఇలా చేయండి!

విటమిన్ డి అనేది విటమిన్ కాదు. కానీ అది ఒక ప్రో హార్మోన్. అయితే ఎప్పుడైనా విటమిన్ డి ని ఆహారం ద్వారా కాని సూర్యకిరణాలు ద్వారా కాని తీసుకుంటే మొదట అది లివర్ మరియు కిడ్నీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్ని విటమిన్స్ లాగ వెంటనే దానిని ఉపయోగించుకోవడానికి అవ్వదు. ఇలా ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఉపయోగించడానికి అవుతుంది.
ఒక మిల్లీ లీటర్ కి 20 నానో గ్రామ్స్ నుండి 50 నానో గ్రామ్స్ ఉంటే పరవాలేదు. 20 గ్రాముల కంటే తక్కువ ఉంటే విటమిన్-డి లోపం ఉన్నట్లు. సూర్యకిరణాలు పడకపోవడం, పాలు ఎలర్జీ ఉండడం, కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం కలుగుతుంది. సూర్య కిరణాల ద్వారా ఎక్కువ విటమిన్ డి మనకి లభిస్తుంది. అంతే కాకుండా ఈ విటమిన్ డి మనకి కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా ఇది మనకి లభిస్తుంది. ఇక మరి ఆ ఆహార పదార్థాల గురించి చూస్తే... విటమిన్ డి చేప, ఫిష్ లివర్ ఆయిల్ మరియు గుడ్డులో ఉంటుంది. అలాగే ఫోర్టిఫైడ్ డైరీ మరియు గ్రైన్ ప్రొడక్ట్స్‌లో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జుట్టు రాలిపోవడం, ఎముకల సమస్యలు, తక్కువ ఇమ్యూనిటీ ఉండడం లాంటివి జరుగుతాయి.
సూర్య కిరణాలు విటమిన్-డి తీసుకోవడానికి సహాయం చేస్తాయి. చర్మంలో ఉండే కొలెస్ట్రాల్ ద్వారా ఇది తీసుకోడానికి అవుతుంది. అయితే భారతీయుల చర్మం కొంచెం డార్క్‌గా ఉండడం వల్ల విటమిన్ డి తీసుకోవడం నెమ్మది అవుతుంది. ఇది విటమిన్-డి తక్కువ తీసుకోవడానికి ముఖ్య కారణం.
అదే విధంగా రెండవ కారణం ఏమిటంటే భారతీయ జనాభా కొంచెం సన్నటి చర్మంతో ఉంటారు. దీంతో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీని కారణంగా తక్కువ విటమిన్-డి తీసుకోవడానికి అవుతుంది. అయితే మనుషులు బట్టి వాళ్ళ యొక్క చర్మాన్ని బట్టి కూడా విటమిన్ డి తీసుకోవడం అనేది ఉంటుంది.
విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్-డి దానికి అదే ప్రొడ్యూస్ అయిపోదు. దానిని మనం బయట నుండి తీసుకోవాలి. అంటే సూర్య కిరణాల ద్వారా కానీ సప్లిమెంట్స్ ద్వారా కానీ. ఒకవేళ కనుక విటమిన్ డి మన బాడీలో సరిగా లేదు అంటే హైపర్టెన్షన్ మొదలైన సమస్యలు వస్తాయి. వివిధ రకాల క్యాన్సర్ సమస్యలు కూడా విటమిన్-డి లోపం వల్ల వస్తాయి. అంతే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుండదు. డిప్రెషన్ వంటి సమస్యలు విటమిన్-డి లోపం వల్ల వస్తాయి. విటమిన్-డి మనకి సూర్య కిరణాల ద్వారా అందుతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే దానిపై ప్రతి ఒక్కరు ధ్యాస పెట్టడం చాలా ముఖ్యం. ఎక్కువగా విటమిన్ డి లోపం వల్ల ఎముకల సమస్యలు వస్తాయి. పెద్దవాళ్లలో విటమిన్-డి లోపం ఉంటే మజిల్ వీక్నెస్, ఎముకల నొప్పులు మొదలైన సమస్యలు వస్తాయి. అదే పిల్లల్లో అయితే రికెట్స్ వంటి ఎముకల సమస్యలు వస్తాయి.
ఆరోగ్యం బాగుండాలంటే అన్ని రకాల పోషక పదార్థాలు మనం తప్పక డైట్‌లో తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ప్రతీ ఒక్కరికి విటమిన్ డి చాలా అవసరం. చాలా మంది ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదేమైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. విటమిన్-డి ప్రతి ఒక్కరూ అందేటట్టు చూసుకోవాలి.
పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో అయితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇది ఇలా ఉంటే విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఐవిఎఫ్ పద్ధతుల్లో సక్సెస్ అవ్వడం, పీరియడ్స్‌లో మార్పులు కూడా వచ్చాయి. అదే విధంగా ఫెర్టిలిటీ అవకాశాలు కూడా పెరగడం జరిగింది. ఇలా విటమిన్ డి వలన ఎన్నో మార్పులు రావడం మనం చూడచ్చు. అలాగే ఎప్పటికప్పుడు విటమిన్ డి లెవెల్స్ ని చెక్ చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు మరియు పెద్దవాళ్ళు విటమిన్-డి ని చెక్ చేయించుకోవాలి.
విటమిన్ డి లోపం ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవడం, ఎండలో ఉండటం లాంటివి చేయాలి. పది నిమిషాల పాటు ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి మనకి లభిస్తుంది. అంతే కాకుండా విటమిన్ డి ఫోర్టిఫైడ్ సెరల్స్, డైరీ ప్రొడక్ట్స్, పుట్టగొడుగులు వంటి వాటి ద్వారా మనం పొందొచ్చు. కాబట్టి డైట్ లో వాటిని కూడా తీసుకోవడం మంచిది ప్రతి రోజు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండ వేడి లో ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వారంలో కనీసం మూడు నుండి నాలుగు సార్లు ఎండలో ఉంటే చాలా మంచిది. అదే విధంగా సాల్మన్, పుట్టగొడుగులు, గుడ్లు, సోయ్ డ్రింక్స్, కమల జ్యూస్, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిదని అన్నారు. కనుక విటమిన్ డి లోపం లేకుండా, ఇటువంటి సమస్యలు ఏమి రాకుండా ఇక్కడ వున్నా ఈ పద్ధతులని పాటించి ఆరోగ్యంగా ఉండడం మంచిది. లేదు అంటే తప్పక ఇబ్బంది పడాలి. కాబట్టి ఈ టిప్స్ ని ప్రతి రోజు ఫాలో అయి మరెంత ఆరోగ్యంగా వుండండి.





Untitled Document
Advertisements