మాములుగా మనం దైవదర్శనార్ధం గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శించుకున్న తరువాత కాసేపు గుడి ఆవరణంలో కుర్చుని దేవుడిని చూస్తూ ఉండమంటారు పెద్దలు. అల ది దర్శనము తరువాత కుర్చోమనడానికి గల కారణం స్వామి దర్శనమూ, షడగోప్యము అయ్యాక ఒకింత సేపు దేవాలయములో కూర్చొనివెళ్ళాలి. అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాము. ప్రశాంత మనసుతో భగవంతుని గురించి ఆలోచిస్తాం. రోజు వారి జీవన విధానాన్ని సరిచేసుకుని సరైన మార్గంలో నడుస్తాము. కేవలం కూర్చోవడమే కాకుండా ఓ రెండు నిమిషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది. కూర్చున్న కొద్ది సమయములోనే మనము దర్శనము చేసిన భగవంతుని రూపమును మన మనసులో పదిలము చేసుకొనుటకు అవకాశము కలుగుతుంది.