పంజాబ్ లో కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా!

     Written by : smtv Desk | Wed, Jan 19, 2022, 01:05 PM

పంజాబ్ లో కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా!

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పెద్ద వ్యూహానే రచించినట్లుంది. అసెంబ్లీ పోలింగును ఫిబ్రవరి 14 నుంచి 20కి మార్చటం వెనుక దళితుల ఓట్లకు కాంగ్రెస్ గాలమేసినట్లే అనిపిస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ లో ప్రతి ఏడాది గురు రవిదాస్ జయంతి జరుగుతుంది. ఆయన జయంతికి పంజాబ్ లోని దళితులు పెద్ద ఎత్తున హాజరవుతారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఇబ్బంది ఎదురైంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలనే వాయిదా వేసుకోవాలని దళిత సంఘాలు కోరాయి.
దళిత సంఘాల తరపున సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు సిఫారసు చేయడం కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ తేదీని మార్చటం అంతా జరిగిపోయింది. చన్నీ సిఫారసు చేసిన వెంటనే బీజేపీ కూడా మద్దతు పలకటం ఇంకా ఆశ్చర్యం. ఇదంతా జరగటానికి కారణం కేవలం దళితుల ఓట్ల కోసమే. పంజాబ్ నుంచి బెనారస్ కు 20 లక్షల మంది దళితులు వెళ్ళటమంటే మామూలు విషయం కాదు. ఎన్నికల తేదీని మార్చటం వెనుక చన్నీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట. ఎందుకంటే ఆయన కూడా దళితుడే కాబట్టి. పంజాబ్ కు మొదటిసారి ఒక దళితుడు సీఎం అయ్యారు. అందుకనే చన్నీ కూడా ప్రత్యేకించి పోలింగ్ తేదీ మార్పు కోసం ప్రయత్నించారట. పోలింగ్ తేదీ మారిందంటే కేవలం చన్నీ తీసుకున్న ప్రత్యేకమైన చొరవ వల్లే అని యావత్ దళిత సంఘాలు భావిస్తున్నాయట. అందుకనే రాబోయే ఎన్నికల్లో దళితుల ఓట్లు కాంగ్రెస్ కే పడతాయని ప్రచారం మొదలైంది.
ఈ ఒక్క కారణంతోనే దళితులందరు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తారా అనేదే డౌటు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జనాల్లో దూసుకుపోతోంది. ప్రజాధరణ ఉన్న ఎంపీ భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఇంకే పార్టీ కూడా ఇలాంటి సాహసం చేయలేకపోతున్నాయి. పంజాబ్ లో మొత్తం 32 శాతం దళితులున్నారు. ఇప్పటివరకు మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ కే పడుతున్నాయి. మొదటిసారి దళితుల ఓట్ల విషయంలో ఆప్ పోటీకి వచ్చింది. మరి కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.





Untitled Document
Advertisements