బూస్టర్ డోస్ పై ప్రముఖ శాస్త్రవేత్త కీలక వాఖ్యలు!

     Written by : smtv Desk | Thu, Jan 20, 2022, 11:58 AM

బూస్టర్ డోస్ పై ప్రముఖ శాస్త్రవేత్త కీలక వాఖ్యలు!

గతకొంతకాలంగా మనతోనే జీవిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం మళ్ళీ విరుచుకుపడుతూ తన మూడవ దశతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఎక్కడ చూసిన కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేశమంతటా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతుండటంతో. మీడీయా సంస్థల్లోనూ కరోనా సంబంధిత వార్తలకు ప్రాధాన్యత పెరగటంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద హెచ్చరికలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కోరల నుండి తప్పించుకోవటానికి బూస్టర్ డోస్ అవసరమన్న వాదనను వినిపిస్తున్నాయి. ఇటువంటి వాదనలు వినిపిస్తున్న వేల ప్రముఖ శాస్త్రవేత్త కీలక వాఖ్యాలు చేసారు. ఆమె ఏమన్నారు అనేది కాస్త తెలుసుకుందాం..
ఎందుకంటే.. బూస్టర్ డోస్ మీద చెబుతున్న ఆమె వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోకూడదు.కారణం.. ఆమె ఆషామాషీ మహిళ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రధాన శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్న డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనేక దేశాల్లో బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ తీరు మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న అంచనాలు.. జరుగుతున్న ప్రచారం ప్రకారం చూసినప్పుడు.. ఆరోగ్యంగా ఉన్న వారికి బూస్టర్ డోసు అవసరమని ఏ పరిశోధనలోనూ తేల్లేదని ఆమె చెబుతున్నారు. ఆ మాటకు వస్తే.. అసలు బూస్టర్ డోస్ కు సంబంధించి ప్రామాణికమైన ఆధారం లేదన్నది ఆమె వాదన. కొవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు.. తీవ్ర వ్యాధిగ్రస్తులు.. పెద్ద వయస్కులు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు.. వైద్య సిబ్బందిని కాపాడటమే లక్ష్యంగా బూస్టర్ డోసును ఉపయోగించుకోవాలి.
అంతే తప్పించి.. అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వకూడదు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు.. పెద్దలకు బూస్టర్ డోసు అవసరమని తెలిపే ఆధారాలు ఏమీ లభించలేదని ఆమె చెబుతున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వాదనకు భిన్నంగా ఇప్పటివరకు కొందరు శాస్త్రవేత్తల వాదన ఏమంటే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ.. గతంలో తీసుకున్న రెండుడోసుల వ్యాక్సిన్ సమర్థంగా పని చేయకపోవచ్చని.. రోగనిరోధక శక్తిని మరింత పెంచుకోవటానికి బూస్టర్డోసు అవసరమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసుల్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అమెరికాలో అయితే.. పెద్ద వయస్కులకు మాత్రమే కాదు 12-15 ఏళ్ల మధ్యనున్న టీనేజర్స్ కు సైతం బూస్టర్ డోసుల్ని ఇస్తున్నారు. ఇలాంటి వేళ.. బూస్టర్ డోస్ పై వ్యతిరేక గళాన్ని విప్పుతున్నారు డాక్టర్ సౌమ్య స్వామినాథన్. ఆమె వాదన ప్రకారం చూస్తే..అసలు బూస్టర్ డోసులు ఎవరికి ఇవ్వాల్సి ఉంటుందన్న అంశంపై మరింత రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.





Untitled Document
Advertisements