'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో చరణ్ స్టార్ డమ్ పాన్ ఇండియా లెవల్ కి పెరిగిపోయింది. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత చరణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది 'ఆచార్య'. కొరటాల డైరెక్షన్ భాద్యతలు చేపట్టిన ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి చరణ్ నటించాడు. ఒక రకంగా ఇది మల్టీ స్టారర్ మూవీ అనే అనుకోవాలి. ఈ నెల 29వ తేదీన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదలవుతోంది.
ఇక ఈ మూవీ తరువాత శంకర్ డైరెక్షలో చరణ్ ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' .. 'ఆచార్య' తరువాత చరణ్ ఫ్రీ కావడం వలన, ఇక త్వరలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెడుతున్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి .. హైదరాబాద్ .. దుబాయ్ లలో కొంత షూటింగ్ చేయనున్నట్టు తెలిపారు.
కొన్ని ముఖ్యమైన సీన్స్ పంజాబ్ .. అమృత్ సర్ ప్రాంతాలలో షూట్ చేయబోతున్నారనేది తాజా సమాచారం. చరణ్ కి జతగా హీరోయిన్ కియారా అద్వాని నటిస్తున్న ఈ చిత్రంలో, విలన్ క్యారెక్టర్ అరవిందస్వామి పోషించనున్నట్టు తెలుస్తోంది. హీరో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.