జోడీ లేకుండానే మెగాస్టార్ వరుస చిత్రాలు..

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 08:47 AM

జోడీ లేకుండానే మెగాస్టార్  వరుస చిత్రాలు..

టాలీవుడ్ లో కమర్షియల్ మూవీ అనగానే హీరో పక్కన హీరోయినా కచ్చితంగా ఉండాల్సిందే. పైగా ఆ ఇద్దరి మధ్య పాటలు, డ్యాన్స్లు, రోమాన్స్ ఆన్ని కచ్చితంగా ఉండాలని బావిస్తుంటారు. కమర్షియల్ చిత్రం అంటే ఎక్కువగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేది కాబట్టి వారు ఇవే కోరుకుంటారని కనుక ఇవి లేకపోతే సినిమాలు ఆడవని అనుకునే ఫిలిం మేకర్స్ ఉన్నారు. కథకు అవసరం లేకున్నా కేవలం మాస్ ఆడియన్స్ ను ఆకర్షించడానికి అలాంటి అంశాలు జోడిస్తుంటారు. హీరో పక్కన హీరోయిన్ ఉండాలి కనుక పాత్ర సృష్టించి సన్నివేశాలను అల్లుకుంటారు. అదనంగా గ్లామర్ యాడ్ అవడంతో పాటుగా.. మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుంది కనుక అందరూ ఇదే ఫాలో అవుతూ వస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమా అంటే కచ్చితంగా వారి పక్కన హీరోయిన్ ఉండాల్సిందే. హీరోయిన్ లేకుండా నిర్మించిన సినిమాలు చాలా రేర్ అనే చెప్పాలి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో అసలు జోడీ లేకుండా సినిమాలు చేస్తారని ఎవరూ ఊహించరు. కానీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలలో హీరోయిన్ లేకుండానే వస్తున్నారు చిరు.
చిరంజీవి నటించిన తాజా చిత్రం ''ఆచార్య''. ముందుగా ఇందులో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకొని కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను సినిమా నుంచి పూర్తిగా తొలగించారు. ఈ విషయం మీద మేకర్స్ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.
ఆచార్య కు కథానాయికను పెట్టి రొమాన్స్ చేయించడం వల్ల ఆ పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో.. కాజల్ పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేకపోతున్నామనే కారణంతో ఆమెను తీసేయాల్సి వచ్చిందని డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అంటే ఈ చిరంజీవికి జోడిగా హీరోయిన్ లేకుండానే ఈ శుక్రవారం 'ఆచార్య' చిత్రం రిలీజ్ కాబోతోంది.
ఇక మెగాస్టార్ ప్రధాన పాత్రలో మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ''గాడ్ ఫాదర్''. ఇది మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేశారు. అయితే ఒరిజినల్ లో మాదిరిగానే ఇందులో హీరో క్యారక్టర్ కు హీరోయిన్ లేదని తెలుస్తోంది.
నయనతార కీలక పాత్ర పోషిస్తోంది కానీ.. అది హీరోయిన్ పాత్ర కాదు. 'గాడ్ ఫాదర్' అనేది పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. చిరు మిడిల్ ఏజ్ మ్యాన్ క్యారక్టర్ లో కనిపిస్తారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఫోటోలను బట్టి ఈ విషయం అర్థం అవుతుంది. అంటే రాబోయే రెండు చిత్రాలలోనూ చిరంజీవి సింగిల్ గా నే కనిపిస్తారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి పక్కన హీరోయిన్ లేకపోతే వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. స్టోరీ ఎలా ఉన్నా మెగాస్టార్ కు హీరోయిన్ ఉండాలని అభిమానులు కోరుకుంటారు.. అమ్మడుతో లెట్స్ డు కుమ్ముడు అంటేనే వారికి కిక్ ఎక్కుతుంది. కానీ ఇప్పుడు 'ఆచార్య' తో పాటుగా 'గాడ్ ఫాదర్' చిత్రంలోనూ హీరోయిన్ లేదు.
ఫ్యాన్స్ అభిరుచికి తగినట్టుగా చిరూకి పెయిర్ సెట్ చేస్తే స్టోరీ దెబ్బ తింటుందని డైరెక్టర్ కొరటాల శివ మూవీలో హీరోయిన్ పాత్రను తొలగించారు. ఇక గాడ్ ఫాదర్ చిత్రంలో అలాంటి రోల్ కు అవకాశమే లేదు. మెగాస్టార్ తన ఏజ్ ను దృష్టిలో పెట్టుకొని అలాంటి స్క్రిప్టులు ఎంచుకుంటున్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి.
కాకపోతే 'ఆచార్య'చిత్రంలో హీరోయిన్ లేకపోయినా.. గ్లామర్ కేమీ లోటు లేదు. రామ్ చరణ్ కు జోడీగా నీలాంబరి క్యారెక్టర్ లో పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ నటించింది. వీరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లే కాదు.. ఒక సాంగ్ కూడా ఉంది. అలానే 'సానా కష్టం' అనే ఐటమ్ సాంగ్ లో రెజీనా కసాండ్రా హాట్ హాట్ గా కనిపించనుంది. మరి 'గాడ్ ఫాదర్' లో గ్లామర్ కోసం మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
అయితే ఆ తర్వాత చిరంజీవి నుంచి వచ్చే రెండుచిత్రాల్లో కథానాయిక పాత్ర ఉంటుంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న 'భోళా శంకర్' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా సందడి చేయనుంది. అలానే బాబీదర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేయనుంది. సో రెండు సినిమాల్లో మెగాస్టార్ సరసన హీరోయిన్ లేకపోయినా ఆ తర్వాత రాబోయే మాత్రం మాత్రం జోడీ ఉండబోతోందన్నమాట.






Untitled Document
Advertisements