ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు సినిమా విషయాలు వెల్లడిస్తాం.. కొరటాల శివ

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 10:35 AM

ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు సినిమా విషయాలు వెల్లడిస్తాం.. కొరటాల శివ

మెగాసార్ట్ , మెగాపవర్ స్టార్ అయిన తండ్రి కొడుకులిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఇంకో రెండు రోజుల్లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివదర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నారు. ఈ డైరెక్టర్ నుంచి సినిమా వచ్చి దాదాపుగా నాలుగేళ్లవుతోంది. ఆయన ఫ్యాన్స్ కూడా `ఆచార్య` రిలీజ్ కోసం చూస్తున్నారు.
ఆచార్య చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ప్రింట్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా `ఆచార్య` సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలని వెల్లడించిన ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నచిత్రం గురించి ఆశ్చర్యకర విషయాల్ని వెల్లడించారు. ఇది ఎన్టీఆర్ నటించనున్న 30వ సినిమా కావడంతో దీన్ని పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కొరటాల మార్కు కథతో తెలరపైకి రానుంది.
ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి అడిగిన ప్రశ్నకు కొరటాల శివ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాను. మరో వారం తరువాత దీని గురించి మాట్లాడతా. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు మేము ఏమీ అనుకోలేదు. కథ లాక్ చేశాం. `ఆచార్య` అయిపోయాక ఎన్టీఆర్ నేను కలిసి కూర్చుని చర్చించుకుంటాం. `జనతా గ్యారేజ్` అప్పుడే అనుకున్నాం. ఇంత వరకు ఎన్టీఆర్ అన్ని చిత్రాలు ఒకే తరహాయే చేస్తున్నారని భావించి ఎన్టీఆర్ పాత్రని కొత్తగా రాసే ప్రయత్నం చేశాను.
ఎన్టీఆర్ స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు. ఈ సారి హైవోల్టేజ్ మువీనే. నాకు పాన్ ఇండియా స్టార్ డమ్ అలాగే ఆయన ముందు సినిమాల బ్యాగేజీలు నాకు వద్దు. మంచి కథ రాసుకున్నా..దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తా. `పుష్ప -2` తరువాత బన్నీతో ఓ మూవీ వుంటుంది. ఎన్టీఆర్ పాపం నన్ను తన సినిమా విషయంలో డిస్ట్రబ్ చేయడం లేదు. `ఆచార్య` ఫినిష్ చేసుకుని వచ్చెయ్ నిన్ను కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోతా అంటున్నాడు.
మరో పది రోజుల్లో తారక్ చిత్రానికి సంబంధించిన చాలా వరకు ఆసక్తికర విషయాలన్నీ వెల్లడిస్తాం. ఎన్టీఆర్ తో చర్చించకుండా అన్నీ బయటికి చెప్పడం తప్పుకదా? . ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఓ వేదిక అనుకున్న తరువాత దాని ద్వారానే తారక్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించాలని నిర్ణయించుకున్నాము. మే 21న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆ రోజే అన్ని విషయాలు అధికారికంగా వెల్లడిస్తాం` అని చెప్పుకొచ్చారు కొరటాల శివ.






Untitled Document
Advertisements