సినిమా ఆడియో ఫంక్షన్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, ఇంటర్వ్యు అయినా అవార్డ్స్ ఫంక్షన్ అయినా.. సిని ఇండస్ట్రిలో ఈవెంట్ అనగానే మొదట గుర్తొచ్చేది ఈమె. ఆమె మరెవరో కాదు యాంకర్ సుమ రాజీవ్ కనకాల. బుల్లి తెర ప్రేక్షకులకు దశాబ్దాల కాలంగా సుపరిచితురాలు సుమ. ఆమెను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అభిమానిస్తుంటారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె ఆనాటి నుండి తన మాటలతో చేతలతో తనదైన శైలీలో బుల్లి తెరను ఎలేస్తుంది.
బుల్లి తెర మహారాణిగా పేరున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జయమ్మ పంచాయితీ' విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త రాజీవ్ కనకాలతో విభేదాలు వచ్చాయంటూ వస్తోన్న వార్తలపై స్పందించింది. తమ పెళ్లయి 23 ఏళ్లు అవుతోందని, తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పింది.
తమపై వదంతులు వచ్చినప్పుడు తాను తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తానని తెలిపింది. వాటి ద్వారా ఆ వదంతులకు కొంతవరకైనా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తానని వివరించింది. సినీ పరిశ్రమలో ఇలాంటి వదంతులు సాధారణమేనని, సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదని వ్యాఖ్యానించింది.
అటువంటి వాటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి పోయామని తెలిపింది. కాగా, రాజీవ్తో సుమకు విభేదాలు వచ్చిన కారణంగా వారు, వేర్వేరుగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి.