సాయి పల్లవి, రానా నటించిన " విరాటపర్వం" సినిమా డేట్ రిలీజ్ అయింది ..

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 05:51 PM

సాయి పల్లవి,  రానా నటించిన

వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి మరియు దగ్గుబాటి రానా లు ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాట పర్వం . అయితే ఈ సినిమాలో ప్రియమణి భరతక్క గా మరియు నవీన్ చంద్ర లో ప్రధాన పాత్ర పోషించనున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసిందనే వార్తలు వచ్చాయి. ఐతే.. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంది. ఈ సినిమాలో రానా రవన్న అనే కామ్రేడ్ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చరు. అందుకే ఈ రోజు సాయంత్రం.. 5 గంటలకు ఈ సినిమా ఎపుడు రిలీజ్ చేయాలనే విషయాన్ని రివీల్ చేయనున్నట్టు ఓ పోస్టర్‌ విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా ఈరోజు 5 గంటలకు విరాటపర్వం సినిమా ను జూలై ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.





Untitled Document
Advertisements