రాడిసన్ పబ్బు డ్రగ్స్ కేసులో మరో ముందంజ వేసిన పోలీసులు..

     Written by : smtv Desk | Mon, May 09, 2022, 11:50 AM

రాడిసన్ పబ్బు డ్రగ్స్ కేసులో మరో ముందంజ వేసిన పోలీసులు..

మహానగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్బులో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నవాళ్లలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి కూతురు నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార యాదవ్ కొడుకు అరవింద్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు, ఓ మాజీ డీజీపీ కుమార్తె తోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు, రాజకీయ ప్రముఖుల సంతానం అంతా కలిపి 144 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరాను అడ్డుకోలేకపోయిన కారణంగా అధికారులపై స్పెన్షన్ వేటు వేశారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో పోలీసులు పురుగోతి సాధించారు. పబ్‌పై దాడి చేసిన రోజున ఐదుగురు వ్యక్తులు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారించారు. పోలీసులకు దొరికిన 128 మందిలో 45 మందికి గతంలో డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 45 మందికి నోటీసులు జారీ చేసిన బంజాహిల్స్ పోలీసులు.. వారిని ప్రశ్నించారు.డ్రగ్స్ వాడిన ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.





Untitled Document
Advertisements