బుట్టబోమ్మకు దక్కిన అరుదైన గౌరవం.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భార‌త ప్ర‌తినిధిగా..

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 08:07 AM

బుట్టబోమ్మకు దక్కిన అరుదైన గౌరవం.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భార‌త ప్ర‌తినిధిగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే అందం అభినయం ఆమె సొంతం. తెలుగు ప్రేక్షకులంతా బుట్టబోమ్మగా పిలుచుకునె ఈ భామకు ఓ అరుదైన అవ‌కాశం ద‌క్కింది. కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా పూజ హెగ్డే హాజ‌రు కానున్నారు. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడు‌క‌లు ఈ నెల 17న మొద‌లు కానున్నాయి. ఈ నెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధిగా పూజ హెగ్డే హాజ‌రుకానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే.. ద‌క్షిణాది చిత్రాల్లో స‌త్తా చాటుతున్న పూజ‌... కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది. అంటే.. ఈ వేడుక‌ల‌కు తొలిసారి హాజ‌రవుతున్న స‌మ‌యంలోనే భార‌త దేశ ప్ర‌తినిధిగా వేడుక‌ల్లో ఆమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నార‌న్న మాట‌.
ఇక పూజ సినిమాల విషయానికి వస్తే రాధేశ్యామ్ ఈ మదనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించనప్పటికీ పూజ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ మహేష్-త్రివిక్రమ్ ల కాంబోలో రాబోతున్న చిత్రంలో నటిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లోనూ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.





Untitled Document
Advertisements