భారత షట్లర్లు బ్యాంకాక్ లో జరుగుతున్న థామస్, ఉబెర్ కప్ లో నిరాశను మిగిల్చారు. వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్కు చేరుకున్న భారత పురుషుల జట్లకు ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురయ్యాయి అటు మహిళా జట్లు కూడా నిరాశను మిగిల్చాయి. థామస్ కప్ గ్రూప్-సిలో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 2-3తో చైనీస్ తైపీ చేతిలో, ఉబెర్ కప్లో పివి సింధు నేతృత్వంలోని మహిళల జట్టు 0-5తో కొరియా చేతిలో ఓడాయి. స్టార్ ప్లేయర్ వీవీ సింధు వరుస గేముల్లో చిత్తవడం ఆందోళనకు గురి చేసింది. సింగిల్స్లో సింధు 15-21, 14-21తో అన్ సి యంగ్ చేతిలో ఓడగా ఆకర్షి...కిమ్ గ ఉన్ చేతిలో, అస్మిత... సిమ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే డబుల్స్లో శ్రుతి-సిమ్రన్, తనీష-ట్రీసా కూడా చిత్తైన కూడా , గురువారం జరిగే మహిళల క్వార్టర్స్లో థాయ్లాండ్తో భారత్ తలపడనుంది. కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ నెగ్గినా.. తొలి సింగిల్స్లో లక్ష్య సేన్ 19-21, 21-13, 17-21తో చో టిన్ చన్ చేతిలో మరియు లక్ష్యసేన్తోపాటు డబుల్స్ జోడీలు పరాజయం పాలయ్యాయి. డబుల్స్లో సాయిరాజ్-చిరాగ్ 11-21, 19-21తో లి యాంగ్-వాంగ్ చి లిన్ చేతిలో ఓడడంతో భారత్ 0-2తో వెనుకబడింది. అయితే, శ్రీకాంత్ మాత్రం 21-19, 21-16తో వాంగ్ జు వుయ్పై నెగ్గి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు.