ప్రభాస్ సరసన రష్మిక ..

     Written by : smtv Desk | Fri, May 13, 2022, 06:14 PM

ప్రభాస్ సరసన రష్మిక   ..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' చిత్రంలో చేయనున్నట్లు తెలిసిందే . అయితే ఈ చిత్రంలోకి రష్మిక మంధన ను కథానాయికగా ఎన్నుకున్నట్లు సమాచారం . తమిళంలో కార్తి జోడీగా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా విజయ్ సరసన. విజయ్ హీరోగా ఆయన 66వ సినిమా రూపొందనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ఇక తెలుగులో అయితే ''చలో '' మూవితో అరంగేట్రం చేయగా .. దాదాపు అన్ని సినిమాలలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. 'పుష్ప'లో శ్రీవల్లి పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, 'పుష్ప 2' సినిమా కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాక ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును అందరికి పరిచయం చేసింది .అయితే ప్రభాస్ సరసన ఈ స్పిరిట్ చిత్రంలో రాష్మిక మందనతో పాటుగా మరో కథానాయికగా కైరా అద్వాని పేరును ప్రకటించనున్నట్లు సమాచారం . ఇక కైరా అద్వాని ఇటు తెలుగులో మహేష్ బాబు సరసన ''భరత్ అనే నేను '' చిత్రం లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది . ఇక బాలీవుడ్లోను చక్రం తిప్పే ఛాన్స్ కోసం అమ్మడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఆమె అదృష్టం ఎలా ఉందనేది ఈ ఏడాది తెలిసిపోవచ్చు.











Untitled Document
Advertisements