మహమ్మద్ అజహరుద్దీన్ మరియు వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత తరువాత ప్రముఖ హైదరాబాద్ ప్లేయర్ గా పేరుగాంచాడు అంబాటి రాయుడు. టీమిండియా కి ఎన్నో మ్యాచ్ లలో ఎన్నో విజయాలను అందించిన రాయుడు 2019 ప్రపంచకప్ సమయంలో తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. అయితే ఈ ఆటగాడు ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా వెల్లడించిన రాయుడు.. ఈ సీజన్ ఐపీఎల్లే తనకు చివరి ఐపీఎల్ అంటూ పేర్కొన్నాడు. అయితే ఆ ట్వీట్ ను అతడు కాసేపటికే డిలీట్ చేశాడు. దీంతో అతడి రిటైర్మెంట్పై సందిగ్ధం నెలకొంది. అంబటి రాయుడు రిటైర్మెంట్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తోసిపుచ్చింది. అంబటి రాయుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కంటే ఎక్కువగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో మ్యాచ్ లను ఆది గెలిపించాడు . తెలుగు నేలకు చెందిన క్రికెటర్ అంబటి రాయుడి రిటైర్మెంట్ ప్రకటనపై క్రీడాభిమానులలో ఎంతో సందిగ్థత నెలకొంది.రిటైర్మెంట్ పై చెన్నై సూపర్ కింగ్స్
మేనేజ్ మెంట్ అతడితో మాట్లాడినట్లు తెలిసింది. సర్దిచెప్పడంతో రాయుడు వెనక్కుతగ్గాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలోనూ ఇలాగే గుడ్ బై చెప్పిన రాయుడు తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తుంది.