''సర్కారు వారి పాట '' సరికొత్త రికార్డు ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 12:29 PM

''సర్కారు వారి పాట '' సరికొత్త రికార్డు ..

ఈ నెల 12వ తేదీన మిల్క్ బాయ్ మహేష్ బాబు కథానాయకుడిగా మరియు కీర్తి సురేశ్ కథానాయికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'సర్కారువారి పాట' తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. అయితే దర్శకుడు పరశురామ్ సినిమాను రూపొందించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిన్న రాత్రి 'కర్నూల్' లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంత పాల్గొంది. అయితే సినిమా పై నెగటివ్ గా వార్తలు వస్తున్న తరుణంలో మహేష్ బాబు ఫాన్స్ కి ఒక మంచి వార్త దరి చేరింది.ఈ కార్యక్రమంలో స్టేజ్ పైన యాంకర్ శ్యామల 'ఇప్పుడే అందిన వార్త .. ఈ సినిమా మరో రెండు కోట్లను వసూలు చేసింది .. దీంతో 95 కోట్ల షేర్ రాబట్టినట్టు అయింది' అని ప్రకటించడంతో చిత్రబృందపు ముఖాల్లో హర్షం వ్యక్తం అయ్యింది. దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో 'సర్కారువారి పాట' సినిమా 100 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ హీరో మహేష్ బాబు ఎప్పుడూ లేని విధంగా మహేశ్ బాబు తనంతట తానుగా స్టేజ్ పైకి వచ్చి, 'మ మ మహేశా' పాటకి స్టెప్పులు వేయడంతో స్టేజి అంతా ఉర్రుతలూగింది. ఈ సినిమాలో తనకి బాగా నచ్చింది లవ్ ట్రాక్ అని మహేశ్ చెప్పడం మరో విశేషం. హఠాత్తుగా ఆయన అలా చేయడంతో తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని తమన్ అనడంతో మహేశ్ బాబు నవ్వేశారు





Untitled Document
Advertisements