ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటివల జగన్ పాలనపై కంతేరులోని దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మ కొన్ని వ్యాఖ్యలు చేసారు. జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదు కోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పగా .. ఆమె నివాసం పై వైసీపీ నాయకులు ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలని... తమ దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులని చెప్పారు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీ నోటా వినిపిస్తోందని... ఈ ఐదు కోట్ల మంది పైనా దాడి చేయిస్తారా జగన్రెడ్డి గారు? అని లోకేశ్ ప్రశ్నించారు.
అంతేకాక ఈ కింది విధంగా నారా లోకేష్ వరుస ట్వీట్లు చేసారు.
జగన్రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా?(1/3)
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు.(2/3)
నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది.. ఐదుకోట్లమందిపైనా దాడి చేయిస్తారా జగన్రెడ్డి గారు?(3/3
https://twitter.com/naralokesh/status/1526449905073795072?s=20t=hdaKZLYgwD4ktaDd-zikww