అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మహేశ్ బాబు

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 11:58 AM

అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మహేశ్ బాబు

ఆడియన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సూర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చిన 'సర్కారువారి పాట' సినిమా ఘన విజయం సాధించింది. రిలీజైనా ఫస్ట్ డే నుంచే ఈ సినిమా విశ్వరూపం చూపించింది. సూపర్ హిట్ సినిమా నిలిచింది. కేవలం తెలుగులో మాత్రమే రిలీజైనా ఈ సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. రిలీజైనా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 160 కోట్ల గ్రాస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.
'సర్కారువారి పాట' ఘన విజయం సాధించిన నేపథ్యంలో మహేశ్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూవీ బ్లాక్ బస్టర్ చేసిన తన సూపర్ అభిమానులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. మీరందరు కురిపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నానని అన్నారు. మూవీ విజయం సాధించడానికి కారణమైన టీమ్ సభ్యులందరికీ థ్యాంక్స్ చెపుతున్నానని ట్వీట్ చేశారు. ఇంత మంచి మూవీ ఇచ్చిన తన డైరెక్టర్ పరశురామ్ కు, కీర్తి సురేశ్ కు, ప్రోడ్యుసర్స్ కు , అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్ కు థ్యాంక్స్ అని అన్నారు. 'సర్కారువారి పాట' ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని వ్యక్తం చేశారు.


Untitled Document
Advertisements