ప్లే ఆప్స్ కి ఈ రోజు ఏ జట్టు చేరనుందో ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 12:48 PM

ప్లే ఆప్స్ కి ఈ రోజు ఏ జట్టు చేరనుందో ..

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకి డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ జట్లు తలపడనున్నాయి . ఈరోజు ఒక ప్లేఆఫ్ బెర్తు ఖరారయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 13 మ్యాచ్‌లాడి12 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఈరోజు మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే.. నాలుగు ఐదు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఏదో ఒకదాని స్థానాన్ని అక్రమించుకుంటుంది. మరోవైపు న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 13 మ్యాచ్‌లాడి 8 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే లక్నో జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే అప్స్ కి బెర్త్ కన్ఫం చేసుకుంటుంది. ఐతే ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఆ ప్లేస్ అలా ఉన్నప్పటికీ తరువాత వేరే జట్లు తన స్థానాన్ని కిందకి పంపించే అవకాసం కూడా లేకపోలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోల్‌‌కతా ఓడితే మాత్రం.. నిస్సందేహంగా ఆ జట్టు అస్సాం ట్రైన్ ఎక్కడం ఖాయం. బెంగళూరు (-0.323) నెట్‌ రన్‌రేట్ మైనస్‌లో ఉండటం కోల్‌కతాకి కలిసిరానుంది.
ప్రస్తుతం కోల్‌కతా (0.160) నెట్ రన్‌రేట్‌ తో ఉంది ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ‌ భారీ తేడాతో గెలిస్తే ఢిల్లీ (0.255) కంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌ని కూడా సాధించుకోగలదు.
అయితే ఈ మ్యాచ్ ఇప్పుడు ఈ రెండు జట్లకే కాకుండా ఢిల్లీ మరియు ఆర్సిబి జట్ల ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేయ్యనుంది.





Untitled Document
Advertisements