భారత్ తో టీ ట్వంటీ సిరీస్ కి సౌత్ ఆఫ్రికా జట్టు ఇదే ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 06:12 PM

భారత్ తో టీ ట్వంటీ సిరీస్ కి సౌత్ ఆఫ్రికా జట్టు ఇదే ..

భారత్ లోనె కాదు ప్రపంచంలోనే క్రీడాభిమానులకు అసలైన క్రీడా పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగిసిన కొద్ది రోజులకే రోజుల తర్వాత దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది.దీని ద్వారా మరికొన్ని రోజులు క్రీడాభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ క్రమంలో జూన్ 9న ఆరంభమయ్యే ఈ సిరీస్ జూన్ 19వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా 17 మందితో టీంను ప్రకటించింది. సౌతాఫ్రికా ప్రకటించిన జట్టులో దాదాపు సగం మంది ఐపీఎల్ లో ఆడుతున్న వారే ఉండటం విశేషం. దాంతో వీరు ఇప్పటికే భారత్ వాతావరణానికి అలవాటు పడ్డారు. ఈ జట్టుకు బవుమా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయంతో గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అన్రిచ్ నోకియా తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. అదే సమయంలో ఐదేళ్ల తర్వాత వేన్ పార్నెల్ తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. వేన్ పార్నెల్ చివరిసారిగా 2017లో సౌతాఫ్రికా తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. అయితే సౌత్ ఆఫ్రికా ప్రకటించిన టీ ట్వంటీ జట్టు ఇలా ఉంది.
బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్( వికెట్ కీపర్ ) , రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, నోకియా, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, షమ్సీ, ట్రిస్టస్ స్టబ్స్, రస్సీ వ్యాన్ డెర్ డుస్సెన్, మార్కో యాన్సెన్, వేన్ పార్నెల్.
ఈ సిరీస్ కోసం ఈ నెల 23న భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఇక భారత్ తన జట్టును ఈ నెల 29లోపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు మరికొందరు భారత స్టార్ ప్లేయర్స్ కు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements