డబ్బు కంటే అధ్యాత్మికమే మేలు అంటున్న నగల వ్యాపారి..ఆస్థి మొత్తం గోశాలలకు దానం ..

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 11:19 AM

డబ్బు కంటే అధ్యాత్మికమే మేలు అంటున్న నగల వ్యాపారి..ఆస్థి మొత్తం గోశాలలకు దానం ..

కోట్లు సంపాదించినా వారు ఆ ధనాన్ని ఉరికేనే వాడులుకుంటారా.. అంటే వదులుకోరు అనే సమాధానమే వస్తుంది. కాని బాలాఘాట్‌లో చిన్నపాటినగల దుకాణం ప్రారంభించి వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధించి కోట్లు సంపాదించిన ఒక వ్యాపారికి పేరు, కీర్తి రెండూ లభించాయి. అయితే, జీవితంలో ఇంతకుమించినదేదో కావలి అని అనుకుంటూ తన ఆస్తిని రూ. 11 కోట్ల విలువైన ఆస్తిని గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళంగా రాసిచ్చేశారు. ఆ వ్యాపారి పేరు రాకేష్ సురానా.మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన ఆయన తన భార్య లీనా కుమారుడు అమయ్ తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. డబ్బులో కంటే ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితానికి అర్ధం, పరమార్థం దొరుకుతాయని భావించిన ఓ బులియన్ వ్యాపారి తన జీవిత కాలంలో సంపాదించిన రూ. 11 కోట్ల ఆస్తిని విరాళంగా రాసిచ్చేసి తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. గురుమహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాకేశ్ తెలిపారు. నిజానికి కుమారుడు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక బాట పట్టాలని నిర్ణయించుకున్నామని, కానీ మరీ చిన్నవాడు కావడంతో ఏడేళ్లపాటు ఎదురుచూశామని రాకేష్ తెలిపారు. అమెరికాలో చదువుకున్న తన భార్యకు కూడా ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ముగ్గురు దీక్ష తీసుకోనున్నారు. ముఖ్యంగా జైన సమాజం రాకేశ్, భార్య, కుమారుడిని రథంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






Untitled Document
Advertisements