కాంగ్రెస్ పార్టీ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 07:28 PM

కాంగ్రెస్ పార్టీ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

భారత దేశంలో పేరుగాంచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ శిబిర్ కార్యక్రమంపై స్పందించారు . రాజస్థాన్లో నిర్వహించిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభాన్ని చేకూర్చదని స్పష్టం చేశారు. ఈ సమావేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యథాతథంగానే కొనసాగుతుందని జోస్యం చెప్పారు . అంతేకాక గుజరాత్ లో కాంగ్రెస్ పట్టు కోల్పోతుందని ఆయన వెల్లడించారు అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ శిబిరం మరియు వివిధ సమావేశాలు సరైనవే కానీ అనుకున్న దానిని కాంగ్రెస్ పార్టీ ఈ కావలసిన ఫలితాలను ఈ కార్యక్రమాలు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. అంతేకాక హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ లో రాబోయే శాసనసభ ఎన్నికలలో ఎటువంటి ప్రయోజనాలకు ఈ సభలు ఉపయోగకరం కావని ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు కాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements