గవాస్కర్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 02:03 PM

గవాస్కర్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా శుక్రవారం రాయల్ రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పడ్డాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మోయిన్ అలీ 93పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ కొనసాగించడంతో .. 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుంచింది. రాజస్థాన్ టీమ్‌లో బౌలర్లు మెకాయ్ , చాహల్ లు తలా రెండు వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్ రవి చంద్రన్ అశ్విన్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 పరుగులతో తనదైన మార్క్ ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఇక మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లందరూ తొందరగానే వెనుదిరిగిన ఆల్ రౌండర్ అశ్విన్ అందరినీ ఆకట్టుకున్నాడు కేవలం 23 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ ప్లేయర్ సిమ్రాన్ హెట్ మేయర్ బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో వస్తే అతనికి ఎలివేషన్ ఇవ్వాలనే క్రమంలో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అతని భార్య ప్రసవ సమయంలో అతడు వెస్టిండీస్ కి వెళ్ళిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే సునీల్ గవాస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనిఇంటర్నెట్ లో అందరూ గుర్రుమంటున్నారు. ఒక సీనియర్ క్రికెటర్ ఆటగాడు అయ్యుండి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యవస్థ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు .





Untitled Document
Advertisements