ట్రెండ్ అవుతున్న మంత్రి రాక్ గార్డెన్ ఫొటోస్..

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 04:12 PM

ట్రెండ్ అవుతున్న మంత్రి రాక్  గార్డెన్ ఫొటోస్..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా రాక్ గార్డెన్స్ లో ఫోటో షూట్ లో పాల్గొన్నారు ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. నూతన మంత్రివర్గంలో పర్యాటక శాఖను దక్కించుకున్న ఆర్.కె.రోజా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మొదటినుంచి కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే దారిలో ఉన్న రాక్ గార్డెన్స్ సందర్శించారు. ఏపీ టూరిజం శాఖ గురించి ఆమె వివరిస్తూ ఈ రాక్ గార్డెన్స్లో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, కేవ్ మ్యూజియం, బోటింగ్, పిక్నిక్ స్పాట్లు, హరిత రిసార్టు ద్వారా వసతి అందిస్తున్నట్టు రోజా వెల్లడించారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే కర్నూలు సమీపంలోని ఈ రాక్ గార్డెన్స్ ను సందర్శించిన మంత్రి రోజా ఫొటోస్ ఇంటర్ నెట్ లో ఫ్రెండ్ అవుతున్నాయి.





Untitled Document
Advertisements