స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగబోతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్విట్జర్లాండ్ కు చేరుకున్నారు. అయితే విమానయానం లో ఏదో లోపం వల్ల మార్గమధ్యంలో జగన్ లండన్ లో విమానం ల్యాండ్ అయింది. అయితే జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి వెళ్లడం లేదని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఆయన పూర్తి ప్రయాణాన్ని వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలకు కౌంటర్లు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే యూరప్ దేశాలలో తెలంగాణకు పెద్ద పెద్ద కంపెనీల నుండి పెట్టుబడులు తీసుకురావాలని తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు యూరప్ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణా నుండి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి హాజరు అవుతున్న ప్రతినిధి బృందానికి కేటీఆర్ ఆధ్వర్యంలో పాల్గొందట జరుగుతుంది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.