ముంబై ఢిల్లీ నా.. లేక ఆర్సిబి ఢిల్లీ నా..అన్నట్లుగా నేటి మ్యాచ్

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 05:41 PM

ముంబై ఢిల్లీ నా.. లేక ఆర్సిబి ఢిల్లీ నా..అన్నట్లుగా నేటి మ్యాచ్

ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జాయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆప్స్ కి క్వాలిఫై అయ్యాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నాలుగో స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్లే ఆప్స్ కి జుట్టు చేరుకుందో ఈరోజు వెల్లడవుతుంది . ఈరోజు రాత్రి ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ప్లే ఆప్స్ కి నాల్గవ జట్టును ఖరారు చేస్తోంది. ఈ మ్యాచ్ తో ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది ఢిల్లీ జట్టు 13 మ్యాచ్ లలో ఏడు మ్యాచ్లో గెలిచి 14పాయింట్లతో ఐదవ స్థానంలో ఉండగా.. ఈ రెండు జట్ల లో ఏ జట్టు ప్లే ఆప్ కి చేరనుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచులో ముంబై జట్టు గెలిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ కి క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఓడిపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16 పాయింట్లతో ఆర్ సి బి సరసన చేరుతుంది. కావున అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ రన్రేట్ ఆర్సిబి జట్టు కంటే ఎక్కువగా కొనసాగిస్తూ వచ్చింది. కావున ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిస్తే ఈజీగా ప్లే అప్స్ కి క్వాలిఫై అవుతుంది. అప్పుడు ఆర్సిబి జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో తన ప్రస్థానాన్ని ముగించుకోక తప్పదు. అయితే ముంబై నా.. ఢిల్లీ నా.. అనేదానికంటే ఆర్సిబి నా.. ఢిల్లీ నా.. అన్నట్లు కొనసాగుతుంది.





Untitled Document
Advertisements