దావోస్ లో గౌతం ఆదానితో సమావేశమైన సిఎం జగన్

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 10:50 AM

దావోస్ లో గౌతం ఆదానితో సమావేశమైన సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయంగా మారిన విషయం తెలిసిందే. దీనికి కారణం జగన్ లండన్ లో విమానం దిగడమే ..లేట్ ప్రతిపక్ష నేతలంతా జగన్ దావోస్ కు వెళ్ళడం లేదని ఆయన పై వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్విట్జర్లాండ్ దావోస్ నగరానికి చేరుకోప్ని ఆదివారం పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ తో సమావేశమయ్యి రల్డ్ ఎకనామిక్ ఫోరం ప్లాట్ ఫాం పార్టనర్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం కానున్న కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు.. ఎయిర్ పోర్టుల నిర్మాణం.. డెవలప్ మెంట్ మీద క్లాజ్ ష్వాప్ తో చర్చలు జరిపారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్తోనూ సమావేశమయ్యి కరోనా సమయంలో తాము తీసుకున్న జాగ్రత్తలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అంతేకాక భారత ప్రముఖులను కూడా కలిసి వారితో చర్చలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల పై చర్చలు జరిపినట్లు సమాచారం . అనంతరం మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరేతో కూడా సమావేశమయ్యారు సిఎం జగన్ .







Untitled Document
Advertisements