యూత్ లో రకుల్ ప్రీత్ సింగ్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామర్, నటనతో తెలుగు ఆడియన్స్ ను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సైతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. రకుల్ ప్రొఫెషన్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆమె జాకీ భగ్నానీ అనే వ్యక్తి రిలేషన్ లో ఉంది ఆ వ్యక్తి ప్రేమలో మునిగితేలుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ తన ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తను ప్రేమించిన జాకీ తనకు మంచి స్నేహితుడని ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెప్పింది. తమ మధ్య రిలేషన్ షిప్ మొదలయినప్పుడే తమ బంధం గురించి వీలైనంత ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామని తెలిపింది.
తమ రిలేషన్ షిప్ గురించి తాము బయటపెట్టకపోతే అసత్య ప్రచారాలు జరుగుతాయని, వాటితో ప్రశాంతతను కోల్పోతామని రకుల్ చెప్పింది. అందరూ తమ పని గురించి మాట్లాడుకోవాలని కానీ తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని వ్యాఖ్యానించింది. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు ఎలా ఉంటారో అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని చెప్పింది. సెలబ్రిటీల జీవితంపై అందరూ దృష్టి సారిస్తారు కాబట్టి అందుకే తాము తమ ప్రేమ వ్యవహారం గురించి అందరికి చెప్పేశామని చెప్పుకొచ్చారు. ఇక వివాహ విషయానికి వస్తే ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పుకొచ్చింది.